పాదయాత్ర ముగింపులో కీలక ప్రకటనలు చేసిన వైఎస్ జగన్

ఇచ్చాపురంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపులో కీలక ప్రకటనలు చేశారు. ప్రజల క్షేమం కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తనని జగన్ ప్రకటించారు. ఏపీలో నారా చంద్రబాబు నాయుడుతోనే కాదు రెండు ఛానళ్లు, పత్రికలతో కూడా యుద్దం చేయాల్సి వస్తుందని జగన్ అన్నారు.

రైతులకు ఉపయోగపడే కీలకమైన పథకాలను జగన్ ప్రకటించారు. డబ్బు అంటే నాకు వ్యామోహం లేదని అధికారంలోకి వచ్చాక నారా వారు తిన్నదంతా కక్కిస్తానన్నారు. నేను చనిపోతే ప్రతి ఇంటిలో నాన్న ఫోటోతోపాటు తన ఫోటో కూడా ఉండాలన్నది తన ఆశ అని జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని జగన్ అన్నారు. పంట వేసే ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించేలా జగన్ రైతులకు పెట్టుబడి పాయం పథకాన్ని ప్రకటించారు. 

జగన్ తన హామీల్లో ఇచ్చిన ముఖ్యమైన అంశాలు 

రైతులకు నేరుగా ఏడాదికి 12,500 సాయం

మే నెలలో ప్రతి రైతుకు 12,500 రూపాయల చెల్లింపు

రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది

రైతుల ఖాతాకు నేరుగా బీమా సొమ్ముల చెల్లింపు

పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయింపు

ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు

వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు

రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్

ప్రతి ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తాం

ప్రతి రైతుకు వడ్డీలేని రుణం

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు 

4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు

3 వేల కోట్లతో ధరల స్థిరికరణ నిధి ఏర్పాటు

జీడి చెట్టుకు 50 వేల రూపాయల చెల్లింపు

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు, ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు

సహకార సంఘాల డైరీలకు పాలు పోసే రైతులకు లీటర్ కు 4 రూపాయల బోనస్

తిత్లీ తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టుకు 3 వేల రూపాయల చెల్లింపు

గ్రామంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన