అనసూయ పేరుచెప్పి పవన్ పై భీమవరం ఎమ్మెల్యే సెటైర్లు!

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ వారాహియాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలను పవన్ కవర్ చేసి.. యాత్ర ముగిస్తారు! ఆ సంగతి అలా ఉంటే… పవన్ భీమవరం పర్యటన నేపథ్యంలో… గత ఎన్నికల్లో పవన్ ను మట్టికరిపించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీను సంచలన కామెంట్లు చేశారు.

అవును… జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా… పవన్ పార్టీ ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారనే విషయం అందరికీ తెలుసన్న ఆయన.. చంద్రబాబు ప్రయోజనాలకోసం పని చేస్తున్న పవన్, కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా… పవన్ పార్టీ గుర్తు కాపాడుకొడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమయంలో… భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం ఎలా ఉంటుంది వంటి విషయాలు కూడా పవన్ కి తెలియదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పవన్ సభలకు జనం గట్టిగా వస్తుండటంతో… ఆ విషయాలపైనా గ్రంధి సెటైరికల్ గా స్పందించారు. సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్‌ చేశారు.

ఇక తాజాగా గోదావరి జిల్లాల్లో రౌడీ ఇజం పై పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీను స్పందించారు. గోదావరి జిల్లాలో రౌడీయిజం అనేది పెద్ద జోక్ అంటూ పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా… చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన బాబాయ్ వల్ల ప్రాణహాని ఉందని చెప్పిన విషయం.. ఆ సమయంలో పవన్ గన్ పట్టుకుని రౌడీగా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేసే ప్రయత్నం చేశారు భీమవరం ఎమ్మెల్యే!