‘ఇంతకంటే కష్టం.. ఓకే అంటే, ముందుకెళదాం.. లేదంటే, ఇంతే..’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఇటీవల తనను కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులు, సీట్ల పంపకాలపై తేల్చి చెప్పేశారట.! అబ్బే, అసలంటూ సీట్ల పంపకాలపై చర్చ జరగలేదు. పొత్తుల గురించే చర్చ జరగలేదు.. అని జనసేన పార్టీ చెబుతున్న సంగతి తెలిసిందే. ‘కలిసి పోరాటం చేయడం మీదనే జనసేనాని ఫోకస్ పెట్టారు’ అని జనసేన నేతలు చెబుతున్నారు.
మరోపక్క, 20 అసెంబ్లీ సీట్లకు మించి ఒక్క సీటు కూడా అదనంగా ఇచ్చేది లేదనీ, ఒకటీ లేదా రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం వుందనీ జనసేనపై టీడీపీ నేతలు సెటైర్లేస్తున్నారు ఓ వైపు. అసలేం జరుగుతోంది.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, 35 అసెంబ్లీ సీట్లు.. వాటికి అదనంగా 4 లోక్ సభ సీట్లను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు.. అంటూ ఓ యాభై ఎనిమిది సీట్ల వివరాల్ని జనసేన అధినేత, చంద్రబాబు ముందు వుంచారట. కానీ, చంద్రబాబు లైట్ తీసుకున్నారట. బీజేపీ కూడా వస్తుంది గనుక, ఆ పార్టీకీ సీట్లు కేటాయించాల్సి వస్తుంది కాబట్టి.. అని చంద్రబాబు కుంటి సాకులు చెబుతున్నారని అంటున్నారు.
‘మా ప్రతిపాదనలకు ఒప్పుకుంటే.. ఆర్థిక వ్యవహారాలూ మేమే చూసుకుంటాం’ అని జనసేన అధినేతకి టీడీపీ అధినేత భరోసా ఇచ్చారన్నది తాజా ఖబర్.!
