కాంగ్రెస్‌లోకి ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీలు: రేవంత్ రెడ్డి(వీడియోలు)

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అధికార టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, చిల్లర రాజకీయాలు చేసినా అంతిమ విజయం తమదేనన్నారు. కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. తొందర్లోనే కేసీఆర్ ముడ్డి కింద మంట లేవటం ఖాయమని రేవంత్ అన్నారు. 

కొడంగల్ కు హరీష్ రావు లాంటి గుంట నక్కలు వచ్చినా ఏం చేయలేరన్నారు. కేసీఆర్ తోడేళ్ల గుంపును కొడంగల్ కు పంపుతున్నారని వారు ఏ గుంపులుగా వచ్చినా ఏం కాదన్నారు. కొడంగల్ కు రేవంత్ అనే హైటెన్షన్ అడ్డుగా ఉన్నాడన్నారు. కేసీఆర్ రెండో కన్నుతెరిచేందుకే మద్యాహ్నం అవుతుందని  ఇక ఆయన మూడో కన్ను ఏం తెరుస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ముఠాలు, మూటలు కాదు దమ్ముంటే నువ్వే రా కొడంగల్ సంటర్ల తేల్చుకుందామని సవాల్ విసిరారు. 

తాను ఈ నెల 19న ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నానని 50 వేల మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎంత మంది ఏం చేసినా రేవంత్ రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. రాబోయే ప్రభుత్వం తమదేనని కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్నం నరేందర్ రెడ్డి అసలు పోటినే కాదన్నారు. ఆనాడు కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఎట్ల ఫిరాయింపులు చేసిండో ఇప్పుడా సెగ కేసీఆర్ కు తగలబోతుందన్నారు. టిఆర్ఎస్ నేతలు తమ భవిష్యత్తు కోసం వచ్చి తమను బతిలాడుతున్నారన్నారు.

కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడించాలని రేవంత్ రెడ్డిని అణగ తొక్కాలని చూస్తున్నారని వారు ఎంత అణగతొక్కాలని చూస్తే తాను అంత పైకి ఎదుగుతానని రేవంత్ రెడ్డి కార్యకర్తలల్లో ఉత్సాహం నింపారు. కొడంగల్ లో కోట్లకు కోట్ల రూపాయలు తరలాయని, అనేక మంది ముటాలుగా కూడా తిరుగుతున్నారని అయినా ఎవరూ కూడా ఏం చేయలేరని రేవంత్ రెడ్డి అన్నారు. తనను నేరుగా ఎదుర్కొనే దమ్మలేక కేసీఆర్ చేస్తున్న కుట్రలివ్వని రేవంత్ అన్నారు.

తొందర్లోనే ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ చేరబోతున్నారని, ఏట్లు డబ్బాల పడే లోపు వాళ్లు వచ్చి పార్టీలో చేరుతారన్నారు. కేసీఆర్.. నీకు దమ్ముంటే  ఇగ వాళ్లను ఆపుకో ఎట్ల ఆపుతవో చూస్తా.. నువ్వే అందరిని తీసుకుంటావు.. ముడ్డి కింద మంట పెడితే ఎట్ల మండాల్నో అట్ల మండుతది చూడు ఇగ అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. రేవంత్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

 

REVANTH REDDY SENSATIONAL COMMENTS