వైఎస్సార్ బాటలో సీఎం వైఎస్ జగన్ .. ఉగాది తర్వాత ప్రారంభం !

centre good news to ap cm ys jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉగాది తర్వాత సీఎం రచ్చబండకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు సంబంధించి రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులుంటే వాటన్నింటినీ ఉగాదిలోగా పరిష్కరించాలని శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రచ్చబండలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామాలకు వెళ్లినప్పుడు రేషన్‌కార్డులు వంటి సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా ఆలోపే అన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గతేడాదే రచ్చబండ ప్రారంభించాలని కసరత్తు కూడా చేశారు. సంక్రాంతి తర్వాత చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. ఇప్పుడు ఉగాది తర్వాత రచ్చబండను తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎక్కడ నుంచి ప్రారంభించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

మరి కొద్దిరోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రచ్చబండ కార్యక్రమం ఎలా నిర్వహించాలి.. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి అనే కసరత్తు చేస్తున్నారు.ముఖ్యమంత్రి నేరుగా ఒక గ్రామానికి వెళ్లి అక్కడే రచ్చబండపై ఆ గ్రామస్థులతో మాట్లాడాలని భావిస్తున్నాు. ఆ గ్రామంలో సమస్యలు, ఇప్పటివరకూ ప్రభుత్వం అందించిన పథకాలు గ్రామంలో ఎవరెవరికి చేరాయి.. అవి అందడంలో ఇబ్బందులు ఉన్నాయి.

ఎక్కడైనా అవినీతి చోటు జరిగిందా వంటి విషయాలను సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి తెలుసుకోవాలని అనుకుంటున్నారట. తర్వాత మరో చోట బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. దీనిపైనా కసరత్తు చేస్తున్నారు.. అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాదే ప్రారంభించాలనుకున్నా కుదరకపోవడంతో ఉగాది తర్వాత పక్కాగా శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.