వైసీపీ వల్ల నష్టపోతున్న టాలీవుడ్ చిన్న నటులు.. జగన్ ను నమ్ముతారా?

టాలీవుడ్ సినీ సెలబ్రిటీలలో వైసీపీని నమ్ముకున్న వాళ్లకు ఆ పార్టీ మోసం చేసిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్ నటులలో చాలామంది వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే తమకు మంచి పదవులు దక్కుతాయని ఆశించారు. అయితే రోజులు గడుస్తున్నా వైసీపీ నుంచి ఆ పార్టీని నమ్ముకున్న సెలబ్రిటీలకు పదవులు లభించలేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ సెలబ్రిటీలకు సినిమా ఆఫర్లు సైతం తగ్గాయి.

జగన్ ను నమ్మి చాలామంది సినీ సెలబ్రిటీలు నష్టపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి జగన్ లేదా వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. వైసీపీని నమ్మిన సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరం కావడం గమనార్హం. పదవులు ఆశ చూపి వైసీపీ సినీ సెలబ్రిటీలు తమ పార్టీకి ప్రచారం చేసేలా చేసిందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ పదవులు ఇస్తుందని ఇప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు నమ్ముతున్నారు. అయితే 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే అధికారంలోకి వచ్చిన పార్టీ నుంచి ఈ సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పవు. సీఎం జగన్ సినిమా సెలబ్రిటీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరికాదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ గెలుపు కోసం తమ వంతు కష్టపడిన వాళ్ల కోసం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పవచ్చు.

వైసీపీకి ప్రచారం చేసి తప్పు చేశామనే భావన సినీ సెలబ్రిటీలకు కలిగితే రాబోయే రోజుల్లో సినీ సెలబ్రిటీలు ఈ పార్టీ తరపున ప్రచారం చేయడానికి కూడా ఆసక్తి చూపించే అవకాశం అయితే ఉండదు. అలాంటి పరిస్థితి రాకముందే జగన్ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.