ఆ ముగ్గురు మంత్రులకు భారీ షాకివ్వనున్న జగన్.. ఏం జరిగిందంటే?

YS Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మంత్రులకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఆరోపణలపై ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్న ముగ్గురు మంత్రులకు నవంబర్ లో భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. నవంబర్ నెలలోనే ముగ్గురు మంత్రుల మార్పు దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.

జగన్ హెచ్చరికల తర్వాత కూడా కొందరు మంత్రులలో ఏ మాత్రం చలనం లేకపోవడంతో జగన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మంత్రులు నోరు తెరవకపోవడంపై జగన్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులకు షాక్ ఇవ్వడం ద్వారా మిగతా మంత్రుల పనితీరులొ కూడా మార్పు వచ్చే అవకాశం అయితే ఉందని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

వైసీపీ సర్కార్ ఏ చిన్న పొరపాటు చేసినా 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయే అవకాశం అయితే ఉందనే సంగతి తెలిసిందే. ఈ కారణం వల్లే వైసీపీ ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది.

ఈ నెల 22వ తేదీన జగన్ సర్కార్ వైఎస్సార్ చేయూత స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ ఒక్కో మహిళ ఖాతాలో 18,750 రూపాయలు జమ చేయడానికి సిద్ధమైంది. నాలుగేళ్లలో ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ ఏకంగా ఒక్కో మహిళకు 75,000 రూపాయల బెనిఫిట్ అందేలా చూస్తోంది. ఈ స్థాయిలో మహిళలకు బెనిఫిట్ కలిగే విధంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్ మాత్రమేననే సంగతి తెలిసిందే.