చంద్రబాబు నెత్తిన పాలు పోసిన వైఎస్ జగన్.?

నిజమో కాదోగానీ.. ఓ ఆసక్తికరమైన వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్ అవుతోంది. చంద్రబాబు నెత్తిన వైఎస్ జగన్ పాలు పోశారట.! వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? అన్న చర్చకు ఆస్కారమే లేకుండా పోయింది.

2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారని వైసీపీ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కుప్పంలో పార్టీని బలోపేతం చేసుకుంటోంది వైసీపీ. 2024 ఎన్నికల్లో అత్యంత ఖరీదైన నియోజకవర్గం కాబోతోంది కుప్పం. ఈ నేపథ్యంలో చంద్రబాబు హిందూపురం, గన్నవరం, మంగళగిరి తదితర నియోజకవర్గాల గురించి సమాలోచనలు చేస్తున్నారు ప్రత్యామ్నాయం కింద.

ఇంతలోనే చంద్రబాబు అరెస్టయ్యారు. ఇప్పట్లో ఆయన జైలు నుంచి వచ్చే అవకాశమే లేదంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోపక్క, ఈ అరెస్టుని సాకుగా చూపి, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా అంటున్నారు. అదే నిజమైతే, చంద్రబాబు నెత్తిన వైఎస్ జగన్ పాలుపోసినట్లే.

పోటీ చేసి, చంద్రబాబు ఓడిపోతే.. ఇక, టీడీపీ కుక్కలు చింపిన విస్తరలా తయారైపోతుంది. పోటీ చేయకపోతే, ‘జైలు’ సింపతీ అలాగే మిగిలిపోవచ్చు. సింపతీ కోసం, చంద్రబాబు బెయిల్ ప్రయత్నాలు చేయకుండా వుంటారా.? అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ క్వశ్చన్.

నిజానికి, అరెస్టు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలిగానీ.. అరెస్టయ్యాక అత్యంత ఖరీదైన లాయర్లను దించడమెందుకు.? దించి ఏం సాధించినట్టు.? ఎలాంటి గట్టి ప్రయత్నాలూ బెయిల్ కోసం చేయకుండా, నేరుగా చంద్రబాబు జైలుకి వెళ్ళి వుంటే, సింపతీ వేరే లెవల్‌లో వుండేదేమో.! ఇంతకీ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరన్న ప్రచారం నిజమేనా.?