చంద్రబాబు – పవన్ తో పొత్తుకు ఎందుకు ఉబలాటపడుతుంటారు? ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో కచ్చితంగా జనసేనతో పొత్తు అవసరం అని ఎందుకు నమ్ముతున్నారు? అంటే… కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం! టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకుకు కాపు ఓట్లు కూడా తోడయితే కుర్చీ ఎక్కొచ్చనేది బాబు ప్లాన్! అయితే ఈ విషయంలో పవన్ అవసరాన్ని తగ్గించేపనిలో ఉన్నారు చంద్రబాబు.
తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణను పూర్తిగా వాడేయాలని ఫిక్సయ్యారట చంద్రబాబు. కన్నా రాకతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కచ్చితంగా ప్లస్ అవుతందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు కన్నాకు పెద్ద టాస్కే ఫిక్స్ చేశారు చంద్రబాబు. కన్నా సేవలు కేవలం గుంటూరు కి పరిమితం అయిపోతే కాదు.. రాష్ట్రం మొత్తం వాడబోతున్నారంట!
అవును… టీడీపీలో కాపు నాయకులు చాలా మందే ఉన్నా.. ఆ ఓటుబ్యాంకును గంప గుత్తగా తెచ్చే నాయకుడు లేడనేది బాబు ఫీలింగ్ అంట! ఈ నేపథ్యంలో కన్నాను రంగంలోకి దింపి.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయించడం ద్వారా కాపులను టీడీపీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసే పనిని చంద్రబాబు ఇచ్చారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఫలితంగా జనసేనతో పొత్తు కాస్త అటూ ఇటూ అయినా కూడా… కాపులను ప్రభావితం చేయగల స్థాయిలో కన్నాను వాడేయబోతున్నారన్నమాట!