జెడి లక్ష్మినారాయణ, పవన్ అర్ధరాత్రి చర్చలు

సి.బి.ఐ. మాజీ జేడీ లక్ష్మీనారాయణ చివరకు జనసేన కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10గం.30ని. పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారు. శనివారం అర్దరాత్రి ఒంటి గంటకు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ను కలిసి ఆయన చర్చలు జరిపారు.సుమారు45 నిమిషాలుపాటు   వీరిరువురి మధ్య చర్చలు జరిగాయి. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, మాజీ ఉపకులపతి రాజగోపాల్ కూడా జనసేనలతో చేరతారని మాజీ వర్గాలు ప్రకటించాయి.

ఇది ఆశ్చర్య కరమయిన మలుపు. ఎందుకంటే, మూడు నాలుగు రోజుల కిందట ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వార్తలొచ్చాయి.దీనితో ఆయన మీద విమర్శల వర్షం కురిసింది.

 సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా  జగన్ అకమాస్తుల కేసును  లక్ష్మీనారాయణ విచారించారు. ఈ కేసులన్నీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలసి సృష్టించినవని వైసిపి తొలినుంచి ఆరోపిస్తూ వస్తున్నది. ఇపుడు ఆయన టిడిపిలో చేరాలనుకోవడంతో ఈ ముసుగు  తొలగిపోతోందని విమర్శ వచ్చింది.  అక్రమాస్తుల కేసుల దర్యాప్తు చేయటంలో లక్ష్మీనారాయణ అప్పటి సంయుక్త రాష్ట్రంలో బాగా పాపులరయ్యారు. .

మొత్తం మీద విధినిర్వహణలో హోదానే ఇంటిపేరుగా మారిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణ. అంతగా పాపులరైన వ్యక్తి ముందు కొత్తపార్టీ పెడతానని చెప్పి తర్వాత నీరుగారిపోయారు. మొదట కొత్త పార్టీ కాదు, బిజెపిలోకి వెళతాడు అన్నారు. ఆతర్వాత ఆయన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తో కలసి పనిచేస్తారని చెప్పారు. తర్వాత ఇవన్నీ కాదు, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి బీమ్లీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. ఇదే ఖాయమని అనుకుంటున్నపుడు ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇపుడు జనసేనలో చేరబోతున్నారు.

మహరాష్ట్ర ఐపిఎస్ క్యాడర్ కు చెందిన  లక్ష్మినారాయణ ఆంధ్ర సిబిఐ నుంచి మహారాష్ట్ర పేరెంట్ క్యాడర్ కు వెల్లాక