మంత్రి శిద్ధాపై పోటీకి రెడీ! వైఎస్ఆర్ సీపీ ద‌ర్శి అభ్య‌ర్థి ఆయ‌నే!

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ప్రతిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినేత వైఎస్‌ జగన్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న‌కు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఇన్‌ఛార్జి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వేణుగోపాల్ వ్యాపార‌వేత్త‌. ప్ర‌స్తుత ద‌ర్శి టీడీపీ ఎమ్మెల్యే, అట‌వీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు కూడా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. దీనితో శిద్ధా రాఘ‌వ‌రావుపై బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టిన‌ట్ట‌యింద‌ని పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వేణుగోపాల్ వెంట మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఉన్నారు.