బ్రేకింగ్ న్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు

cm jagan mohan reddy n

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే.

అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ..ఈనెల 11న విచారణ హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌ తో పాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, టైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.