జగన్ సొంత జిల్లా లో ఆ 13 పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్‌ !

cm jagan mohan reddy n

ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే, విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.

cm jagan gets super idea than chandrababu
cm jagan  

పంచాయతీల విభజన, నగర పంచాయతీలో విలీనం తదితర అంశాలపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. సంబేపల్లె మండలంలో మూడు పంచాయతీలు, వల్లూరు మండలంలో 2, రైల్వేకోడూరులో 2, నందలూరులో ఒకటి, టి.సుండుపల్లెలో 2, పుల్లంపేటలో 2, కమలాపురం మండలంలో ఒక పంచాయతీపై హైకోర్టు స్టే విధించడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. దీనిపై జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, కడప జిల్లాలో నేడు మూడు నియోజకవర్గాల్లోని 206 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి తొలివిడతలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.