బోరుగడ్డ అనిల్ రగడ.! వైసీపీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తోంది.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను వీరాభిమానినని చెప్పుకుంటాడాయన. తెలుగునాట పెద్దగా పేరూ ఊరూ లేని ఓ పార్టీకి చెందిన నాయకుడట. కానీ, సభ్యత.. సంస్కారం మరిచి.. బూతులు మాట్లాడతాడు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. ఆయనే బోరుగడ్డ అనిల్.

తాజాగా, బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని ఎవరో దుండగులు తగలబెట్టారట. ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈడ్చి ఈడ్చి కొడతానన్నది ఈ బోరుగడ్డ అనిల్. ఆ సంగతేంటో చూస్తామంటూ కొందరు ఆయన ఇంటి మీదకు వెళితే, పారిపోయాడు అనిల్. ఇప్పుడేమో, ఇలా కార్యాలయం తగలబడింది. అయితే, ఈ తగలబెట్టుకోవడం అనేది అనిల్ వ్యూహమంటున్నారు. అనిల్ మాత్రం, కోటంరెడ్డిపై దాడి చేయడం ఖాయమంటున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీకి లింకేంటి.? అంటే, సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు అనిల్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారు.

అనిల్ కోరిన వెంటనే రకరకాల అపాయింట్మెంట్లు వైసీపీ ప్రభుత్వంలో దొరుకుతున్నాయి. అంటే, వైసీపీ ఆయన్ని ఎంటర్టైన్ చేస్తున్నట్లే. మహిళల పట్ల కనీసపాటి గౌరవం లేని ఇలాంటోళ్ళ వల్ల వైసీపీకి జరిగేది నష్టమే తప్ప, వారితో ఎలాంటి లాభమూ వుండదు. నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటోళ్ళను ఎంటర్టైన్ చేసే పరిస్థితైతే వుండదు. మరి, ఎవరు అనిల్‌ని ప్రోత్సహిస్తున్నట్లు.? ఎవరి అండదండలూ లేకుండా మీడియాకెక్కి రేపులు చేస్తానంటూ ఎలా నోరు పారేసుకోగలుగుతున్నాడు.? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది.?