బీజేపీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కిన కన్నా లక్ష్మీ నారాయణ.. జనసేన విషయంలో బీజేపీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో ఉన్న సమయంలో జనసేన విషయంలో తాము ఎలా ఆలోచించేవాళ్లము.. అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం అందేది అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు!
అవును… నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఒకరకంగాను.. బయట మరోవిధంగాను జనసేనతో పొత్తుల విషయంలో బీజేపీ నేతలు మాట్లాడేవారని కన్నా చెబుతున్నారు! నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు.. జనసేనతో పొత్తు గురించి వ్యంగ్యాస్త్రాలు విసిరేవారని.. ఆపార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎదుగాలని ఆదేశాలు ఇచ్చేవారని.. అదే బయటకు వచ్చాక.. జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని అనమనేవారని..ఇదంతా బీజేపీ వ్యూహమని కన్నా చెప్పుకొచ్చారు.
బీజేపీ జనసేనలు పొత్తులో ఉన్నప్పటికీ.. బీజేపీ ఆందోళనలు చేసే కార్యక్రమాల్లో మాత్రం జనసేనను కలుపుకోరని చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. జనసేన కనుక ఒంటరిగా పోరాటాలు చేస్తే మాత్రం.. తమకు చెప్పకుండా చేయడం ఏంటని సోము ప్రశ్నించారని చెప్పుకొచ్చారు!
దీంతో… ఇంతకాలం బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి పుల్లలు పెట్టే కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు బీజేపీ నేతలు!