హరికృష్ణ మృతి పై నోరు జారి మాట్లాడిన బాలయ్య  (వీడియో)

ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా తనదైన వాక్చాతుర్యంతో సందర్భానుసారం సంస్కృత శ్లోకాలు చెబుతూ అలరించే నందమూరి బాలకృష్ణ నోరుజారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్దిగా హరికృష్ణ కూతురు సుహాసిని నామినేషణ్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.

  ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ హరికృష్ణను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ హరికృష్ణ మృతితో అందరికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయన్నారు.  ఆయన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు. ఓ ఛానల్ లో ప్రసారమైన వీడియో కింద ఉంది చూడండి.  

 

Nandamuri BalaKrishna Remembers NTR And Hari Krishna At Suhasini Nomination Time | Kukatpally News