ఈ నెల 23న ఏపీ కేబినెట్ భేటీ .. విశాఖ ఉక్కుపై తేల్చేస్తారా!

People shocked with YS Jagan's ideas 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 23న అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని హాల్ ‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ నెల 19లోపు ఈ సమావేశంలో చర్చించే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రివర్గ సమావేశంలో ప్రధానగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మూడు రాజధానులకు సంబంధించి ఉగాది నాడు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సచివాలయ కార్యాలయాలు విశాఖకు తరలి వెళ్లాలంటే కనీసం రెండు నెలలన్నా కావాలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది.ఈ నెల 23న జరగనున్న కేబినెట్‌లో పలు కీలకాంశాలపై స్పష్టత వచ్చే వీలుంది.

మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారట.. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.