రాస్కోరా సాంబా… వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ : అంబటి రాంబాబు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , జనసేన పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మీ సీఎం సాబ్ కు ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి అంటూ పవన్ నిప్పులు చెరిగారు.

Ambati Rambabu comments on CM Chandrababu Naidu

దీనిపై మంత్రి కొడాలి నాని ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ ను ఉపయోగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరే సాంబా రాస్కో…. గెలిచినోళ్లు కాదు… ఓడినోళ్లే బోడిలింగాలు!” అంటూ పవన్ కు బదులిచ్చారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ చేసిన హెచ్చరికలపైనా అంబటి స్పందించారు. అసెంబ్లీ ముట్టడికి ఇదేమైనా సినిమా షూటింగా అని వ్యాఖ్యానించారు. వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ అని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.

నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో పవన్ కల్యాణ్ గుడివాడ, మచిలీపట్నం ఎమ్మెల్యేలు, మంత్రులైన కొడాలి నాని, పేర్ని నానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.