ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపు.. కొత్త రెట్లు ఇవే!

సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం సవరించింది. కొత్త టికెట్ల రెట్లను నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. మూడు కేటగిరిలుగా టిక్కెట్ల ధరలను విభజించి.. 4 రకాల టిక్కెట్ల రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్లలో ఉండే నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం ధర రూ.40 ఉండగా.. ప్రీమియం రూ.60గా ఉంది. ఏసీ థియేటర్లలో అయితే నాన్‌ ప్రీమియం రూ.70 ఉండగా.. ప్రీమియం రూ.100గా ఉంది. కార్పొరేషన్లలో ఉండే స్పెషల్ థియేటర్లో నాన్‌ ప్రీమియం ధర రూ.100, ప్రీమియం ధర రూ.125గా ఉంది. కార్పొరేషన్లలో ఉండే మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్‌ సీట్లకు రూ.150 ఉండగా.. రెక్లయినర్‌ సీట్‌కు రూ.250ల ధరను నిర్ణయించారు.