Mavigan: అమరావతి పేరుతో దోపిడీ ఆపండి… : పేర్ని నాని నిప్పులు

Mavigan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై, అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా ముస్తాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అమరావతి ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.

మావిగన్ ప్లాన్‌పై సవాల్:- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (Mavigan) ప్లాన్‌ను పేర్ని నాని గట్టిగా సమర్థించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకూడదనే ఉద్దేశంతోనే జగన్ ఈ కొత్త ప్రతిపాదన తెచ్చారని ఆయన స్పష్టం చేశారు.

“వందేళ్లయినా పూర్తికాని అమరావతి గ్రాఫిక్స్‌తో కేవలం దోపిడీ చేస్తున్నారు.”

“మావిగన్ ప్లాన్ తప్పని నిరూపించగలరా? ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే ఆ ప్రాంతానికి అయోధ్య అని పేరు పెట్టుకోండి, కానీ ప్రజల సొమ్మును దోచుకోవడం మాత్రం ఆపండి” అని ఎద్దేవా చేశారు.

ఏబీఎన్ రాధాకృష్ణపై ఆగ్రహం:- మీడియా అధినేత రాధాకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటంపై మండిపడుతూ, రాధాకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“కాశీకి వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చారా? ఆడవాళ్లను గౌరవించడం కూడా మరిచిపోయారా?” అని ఘాటుగా ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం:- ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 4 లక్షల కోట్లు అప్పు చేసిందని, దీనిపై ఎల్లో మీడియా ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.

అమరావతి పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర భారీగా కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో రాధాకృష్ణ ‘బ్యాచ్’ ఎంత పెట్టుబడి పెట్టిందో, అక్కడ వారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు త్వరలోనే వీరికి బుద్ధి చెబుతారని పేర్ని నాని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Mega Bond Revealed | Allu Arjun & Chiranjeevi Relationship | Birthday Special | Telugu Rajyam