సీతారాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే..?

ఏపీ స్పీకరు తమ్మినేని సీతారం తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తూర్పోగోదావరి జిల్లాలో రాజమండ్రిలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన త‌మ్మినేని సీతారం, మీడియాతో మాట్లాడారు. ఈ క్ర‌మంలో ద్రవ్య వినియమ బిల్లును అడ్డుకోవడం ద్వారా టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని, దీంతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.

ఇక శాసన సభ అంటే ప్రజలు ఎన్నుకున్నద‌ని.. అంతిమ నిర్ణయాలు అక్కడే తీసుకుంటారని, అదే ప్రధానమైనదని త‌మ్మినేని సీతారాం తెలిపారు. ఈ క్ర‌మంలో అక్కడ జరిగే నిర్ణయాలు ఫైనల్ అని తేల్చి చెప్పారు. మ‌రోవైపు శాసన మండలిలో జరిగే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అన్ని రాష్ట్రాలకు ఇదే వర్తిస్తుందని, శాసన సభ అత్యున్నతమైనదని తమ్మినేని వివరించారు. అయినా రాష్ట్ర ప్ర‌జ‌లకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అంద‌కుండా ఆప‌డానికి టీడీపీ ఇలా చేసిందా అని త‌మ్మినేని ప్ర‌శ్నించారు.

తెలుగుదేశం పార్టీకి ప్ర‌స్తుతం శాస‌న‌ మండలిలో ఆధిక్యం ఉంది. ఈ క్ర‌మంలో టీడీపీ అక్కడ కొన్ని బిల్లులను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పీకర్ త‌మ్మినేని సీతారం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే త‌మ్మినేని వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. స్పీకరు స్థానంలో ఉండి ఒక పార్టీ వైపు మాట్లాడటం సంప్రదాయం కాద‌ని.. స్పీకరు స్థానంలో కూర్చున్నాక తాము గెలిచిన పార్టీతో ఏ సంబంధాలు ఉండకూడ‌ద‌ని, తటస్థంగా వ్యవహరించాల‌ని, టీడీపీ నేత‌లు విమర్శ‌లు గుప్పిప‌స్తున్నారు.