సంపూ చేసిన పని పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది

జనసేనకు ‘కొబ్బరిమట్ట’ టీమ్ విరాళం
 

‘కొబ్బరిమట్ట’ చిత్ర యూనిట్…పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి విరాళం అందించి వార్తల్లో నిలిచారు. ఆ విధంగా పవన్ అభిమానుల ఆదరణ చూరుకుందీ టీమ్. సంపూర్ణేష్‌బాబు, దర్సక,నిర్మాత సాయి రాజేష్‌ కలిసి రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని సంపూ ట్విటర్‌ ద్వారా తెలిపారు. పవన్‌ అభిమానులు ధన్యవాదాలు చెబుతూ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

దాంతో కొబ్బరి మట్ట చిన్న సినిమా అయినప్పటికీ విరాళం ఇవ్వడం పట్ల ఫ్యాన్స్‌ ప్రశంసిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘కొబ్బరిమట్ట’ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో మూడు కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

సంపూ కేరళ వరద బాధితుల కోసం కొన్ని రోజుల క్రితం రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా ‘హృదయ కాలేయం’ నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. నా వంతుగా రూ.2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను’ అని సంపూ పోస్ట్‌ చేశారు.