నేడు హైదరాబాద్ కు వై ఎస్ జగన్ ?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం హైద్రాబాద్ రానున్నాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి అయన విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి హైద్రాబాద్ పర్యటన సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతుంది. గత శుక్రవారం కోర్టుకు హాజరయిన జగన్ .. మళ్ళీ ఇంత తొందరగా హైద్రాబాద్ రావడం ఏమిటీ? అన్న దిశగా ఆరాలు మొదలయ్యాయి.

అయితే జగన్ హైదరాబాద్ పర్యటన అధికారికం కాదని .. అయన ఓ పెళ్ళికి అటెండ్ అయ్యేందుకు హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. నేడు మధ్యాహ్నం బయలుదేరనున్న జగన్ హైదరాబాద్ కు విమానంలో చేరుకొని, అక్కడినుండి నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారని సి ఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రేపు హైద్రాబాద్ లో జరిగే ఓ వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారని అధికారిక సమాచారం. ఆ తరువాత రేపు సాయంత్రం అయన తిరిగి తాడేపల్లి కి చేరుకుంటారట.