జగన్ పొలిటికల్ లైఫ్ పై జివిఎల్ సంచలన వ్యాఖ్యలు !!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాజకీయ భవితవ్యం పై బిజెపి ఎంపీ జి వి ఎల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడం పై అయన ఈ కామెంట్స్ చేసారు. హోదా అనే వ్యవస్థే లేదని, అలాంటి లేని వ్యవస్థ కోసం మాట్లాడితే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రోజు అయన మీడియాతో మాట్లాడుతూ .. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రా కు కేంద్రం నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రాజుక్టులకోసం ఏకంగా 22 వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చిందని అయన అన్నారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని జగన్ కు కూడా తెలుసు అని అన్నారు. అలాగే ప్రత్యేక హోదాను పునరుద్దరించే ఆలోచన అటు కేంద్రానికి కూడా లేదన్నారు. ప్రస్తుతం జి ఓఎల్ మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల ముందు జగన్ రాష్ట్రానికి తప్పకుండా తక్కువ సమయంలోనే ప్రత్యేక హోదా తెస్తానని ప్రకటించడం .. ఇప్పుడు అసలు ప్రత్యేక హోదా అన్నదే లేదని బిజెపి నాయకులూ చెప్పడం సంచలనంగా మారింది.