జగన్ కు చిరు కృతజ్ఞతలు.. కారణం అదేనా ?

 
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నుండి పూర్తిగా బయట పడకపోయినా   దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మాత్రం చిన్నగా  ఎత్తేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని  సినిమా షూటింగ్ లను మళ్లీ స్టార్ట్ చేయటానికి సినిమా పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి  సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతులు జీవో విడుదల చేసినందుకు సినీ పరిశ్రమ తరపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియ జేసానని మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  లాక్ డౌన్ ముగిసిన అనంతరం సినీ పరిశ్రమ సమస్యల పై చర్చించేందుకు కలుద్దామని జగన్ చెప్పారని చిరు వివరించారు.
 
 
కాగా ఈ విషయం పై మెగాస్టార్ చిరంజీవి పలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో అన్ని విభాగాల నుండి ప్రతి నిధులతో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. సినిమా పరిశ్రమ వైసీపీ  ప్రభుత్వానికి వ్యతిరేఖం కాదని చెప్పడానికే  మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  చిరు పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్ లు మళ్లీ పునరుద్దరణకి చిరు కృషి చేస్తున్నారు.