ఏసు ప్రభువుపై జగన్ కు నమ్మకం ఉంటె :చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నిజంగా ఏసు ప్రభువు పై నమ్మకం ఉంటె ఇక్కడే అమరావతిని కొనసాగిస్తానని చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ రోజు అయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం 39 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బులు లేవని జగన్ అసత్యాలు పలుకుతున్నాడని విమర్శలు గుప్పించారు. స్వార్థంతో అమరావతిని స్మశానం అన్నారని, శ్మశానంలో కూర్చుని పాలించారా అంటూ ప్రశ్నించారు. రాజధానికి వరదలు వస్తాయని, వై సిపి నేతలు ప్రచారం చేస్తున్నారని, అసలు అక్కడ వరదలు రావడానికి ఆస్కారం ఎక్కుడుందని అన్నారు. స్వార్ధ ప్రయోజనకోసమే జగన్ అమరావతిని మార్చే ఆలోచనలు చేస్తున్నాడని చంద్రబాబు మండి పడ్డారు.