ఏపీలో ‘ఏబీఎన్’ ఛానల్ బ్యాన్‌పై పవన్

ఛానెల్ బ్యాన్ పై స్పందించిన పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి,టీవీ 5 తో పాటు పలు వార్తా చానెళ్లపై బ్యాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాన్‌ ని ఎత్తివేయాలంటూ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఎబిఎన్ . మరో ప్రక్క తాజాగా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ మాట్లాడుతూ…ప్రభుత్వంలో ఉన్నవారు అందరినీ సమానంగా చూడాలన్నారు. అధికారంలో ఉన్న వారు వ్యక్తిగత విద్వేషాలు పెంచుకోకూడదని పవన్ సూచించారు.

అలాగే ‘వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే కారణంతో వార్తా చానల్స్‌పై ఆంక్షలు విధించడం సరికాదు. అందరూ మనకు అనుకూలంగా, అనుకున్నట్లుగా ఉండరు. ఉద్దేశపూర్వకంగా వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ ప్రముఖ చానల్ నిలిపివేస్తే నేను ఖండించాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాను. సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి’ అని వైసీపీకి ప్రభుత్వాన్ని జనసేనాని కోరారు.