రాజధాని మార్పు ఖాయమేనా ?

క్షేత్రస్ధాయి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమనే స్పష్టమవుతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్లు, ప్రచారంలో ఉన్నట్లు రాజధాని ప్రాంతం ప్రకాశం జిల్లాలోని దొనకొండకు తరలిపోదు. ఇపుడున్న అమరావతి ప్రాంతంలోనే ఉన్న తుళ్ళూరు మండల శివారుకు మారుతుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

చంద్రబాబునాయుడు డిసైడ్  చేసిన రాజధాని  ప్రాంతం భారీ, శాస్వత నిర్మాణాలకు పనికిరాదు. అందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు వద్దని, ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని శివరామకృష్ణన్ తో పాటు చాలామంది నిపుణులు చెప్పారు. అయినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఎక్కడో వర్షాలు పడినా ఏర్పడిన వరదల ప్రభావం రాజధాని ప్రాంతంపై ఏ స్ధాయిలో ఉంటుందో అందరూ చూస్తున్నదే.

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శాస్వత నిర్మాణాలను తుళ్ళూరు మండలంలోని శివారు ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారట. అక్కడ సుమారు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందట. పైడా రాకీ సాయిల్ తో పాటు కొండవీటి వాగు లాంటి ఎటువంటి సమస్యలు లేవని సమాచారం. అందుకే అక్కడ శాస్వత అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు నిర్మించాలని డిసైడ్ అయ్యారట.

జగన్ తాజా నిర్ణయంతో పచ్చబ్యాచ్ కు మాట్లాడేందుకు నోరు కూడా పెగలదు. ఎందుకంటే రాజధాని నిర్మాణాలను అమరావతి ప్రాంతం నుండి తరలించటం లేదు. కాకపోతే తుళ్ళూరు శివార్లకు మాత్రమే జరుపాలని నిర్ణయించారు. ఎక్కడైనా రాజధాని అంటే అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు, రాజ్ భవన్ నిర్మాణాలే. అంటే ఇపుడున్న తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణాలు అలాగే ఉండిపోతాయి. నిర్మాణంలో ఉన్న క్వార్టర్స్ మాత్రం పూర్తి చేస్తారంతే.