కుక్క పిల్లకు మద్యం తాగించిన యువకులు… సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన రష్మీ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ యాంకర్ కాకముందు వెండితెరపై పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఈ క్రమంలోనే ఈమె వెండితెరపై పలు చిత్రాలలో నటించినా రాని గుర్తింపు బుల్లితెర యాంకర్ గా సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఈమె నటుడు నందుతో కలిసిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బుల్లితెరపై వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇక ఈమె స్వతహాగా జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే.రష్మి మూగజీవాలను ఎవరైనా హింసిస్తే వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి శిక్ష పడే వరకు శ్రమిస్తూ ఉంటారు. జంతువులను ఎంతో ప్రేమించే ఈమె వాటిని ఏమాత్రం కష్టపెట్టకుండా ఉండడానికి కృషి చేస్తారు.జంతువులు పాలు ఇచ్చే సమయంలో ఎంతో కష్టాన్ని అనుభవిస్తాయని తెలుసుకున్న ఈమె పాలు పాల పదార్థాలను మాంసాహారాన్ని కూడా దూరం పెట్టారు. ఇలా వేగన్ గా మారిన రష్మీ ఎవరైనా జంతువులను హింసిస్తే ఏమాత్రం సహించరు.

అయితే సోషల్ మీడియాలోఎంతోమంది వీధి కుక్కలను మూగజీవాలను టార్చర్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కనుక రష్మీ కంటపడితే అందుకు కారణమైన వారికి శిక్ష పడే వరకు ఈమె కృషి చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఇలాంటి పోస్ట్ ఒకటి రష్మి కంటపడింది ఇందులో కొందరు ఆకతాయి వెదవలు కుక్కపిల్లకు గ్లాసులో మద్యం పోసి తాగిస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన రష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందుకు కారణమైన వారిని వదిలిపెట్టకూడదు వారికి శిక్ష పడేలా చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది చూసినటువంటి రష్మీ అభిమానులు జంతువులను హింసించకండి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.