పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పై స్పందించిన డాక్టర్స్.. ఏమన్నారంటే?

జబర్దస్త్ కమెడియన్ గా పంచ్ ప్రసాద్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన కిడ్నీ అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఓసారి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పలువురి ఆర్థిక సహాయం కారణంగా సర్జరీ నిర్వహించారు. అయితే మరోసారి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా మారిందనే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రసాద్ చివరికి నడవలేని స్థితికి వెళ్లిపోయారని తన కాళ్లు చచ్చుబడటంతో ఈయన పరిస్థితి విషమంగా మారింది అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేయడంతో ఎంతోమంది ఈయన క్షేమంగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా ప్రసాద్ ఆరోగ్యం పై వైద్యులు చెప్పిన విషయాన్ని నూకరాజు మరొక వీడియో ద్వారా వెల్లడించారు. పంచ్ ప్రసాద్ గత నాలుగు రోజులుగా హాస్పిటల్ లో ఉంటూ ఆయనకు నిరంతరం సెలైన్స్ ఎక్కిస్తున్నారని అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.

గతంలో నడవడానికి ఎంతో ఇబ్బంది పడినటువంటి ప్రసాద్ ప్రస్తుతం కర్ర లేదా ఇతరుల సహాయంతో నడవగలుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు సెలెన్స్ ద్వారా ఈయనకు యాంటీబయాటిక్స్ అందిస్తున్నారని, ప్రస్తుతం తన ఇంటికి ఒక నర్స్ వచ్చి 24 గంటల పాటు నర్స్ తనకు చికిత్స అందిస్తున్నట్లు నూకరాజు వెల్లడించారు. ఇక ప్రసాద్ గారికి హాస్పిటల్లో వివిధ రకాల స్కానింగ్ లను కూడా నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ఈయన కాస్త కోలుకున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈయన వెంటనే కోలుకోవాలని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.