శ్రీముఖిపై సెన్సేషనల్ కామెంట్స్.. ఫిగర్ అంటూ రెచ్చిపోయిన వేణు-ధన్‌రాజ్.. వైర‌ల్ వీడియో..!!

ప్రస్తుతం బొమ్మ అదిరింది షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అదిరింది షోకు మార్పులు చేర్పులు చేసి వర్షెన్ 2.ఓ అంటూ బొమ్మ అదిరిందిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్‌ను గత ఆదివారం ప్రారంభించారు. ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన షో సక్సెస్‌ఫుల్ అయింది. అనుకున్నదానికంటే వందరెట్ల రెస్పాన్స్ వచ్చింది.

వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేయడంతో ఏపీలో రచ్చ రచ్చ అయింది. జగన్ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. షో నిర్వాహకులను, పర్ఫామ్ చేసిన కంటెస్టెంట్లను, నాగబాబు, శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అభిమానుల ట్రోలింగ్ దెబ్బకు వారంతా సారీ చెప్పారు. అయితే నాగబాబు మాత్రం సెటైర్లు వేస్తూ వారికి ఇంకా రెచ్చగొట్టాడు. ఇక రెండో ఎపిసోడ్ కూడా రాబోతోంది. ఎవ్వరూ ఆపినా ఆగదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక నేటి ఎపిసోడ్‌లో కమెడియన్ వేణు, ధన్‌రాజ్ ద్వయం కామెడీతో నవ్వించేసినట్టు కనిపిస్తోంది. స్కిట్‌లో భాగంగా వీరిద్దరూ న్యూస్ రిపోర్టర్, న్యూస్ ప్రజెంటర్‌గా నటించినట్టు తెలుస్తోంది. అదిరింది సెట్‌లో జరిగిన మార్పుల గురించి రిపోర్టింగ్ చేశారు. అందులో భాగంగా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. ఇక్కడ ఓ భారీ మార్పు సంభవించింది.. ఓ ఫిగర్ వచ్చింది అంటూ ధన్ రాజ్ కామెంట్ చేయడంతో శ్రీముఖి సిగ్గుపడిపోయింది. అలా అనకూడదు అంటూనే… సర్లే ఆ ఫిగర్ పేరేంటో చెప్పు అంటూ వేణు అనేసరికి అందరూ పగలబడి నవ్వేశారు.