మాధురి కేసులో ఊహించని ట్విస్ట్… నేరస్తుడు ఎవరో కనిపెట్టిన జానకి!

కుటుంబ కథ విలువలను తెలియజేస్తూ ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… జానకి తిరిగి కాలేజీకి వెళ్లడానికి సిద్ధమవుతుండడంతో మల్లిక కంగారుపడుతుంది. అదేంటో నేను ఏమనుకున్నా జరగలేదని బాధపడుతూ తల గోడకేసి కొట్టుకుంటుంది. అదే సమయంలో విష్ణు రావడంతో కడుపులో బిడ్డకు ఇలా చేస్తే మంచిదని చెబుతుంది.

మల్లికను జ్ఞానంభ పిలవడంతో అక్కడికి వెళ్లి కాస్త ఓవర్ చేస్తుండగా గోవిందరాజులు తనపై యధావిధిగా సెటైర్లు వేస్తాడు.ఇక చిన్న పిల్లల బొమ్మలను ఇచ్చి ఇవి మీ గదిలో అంటించుకొని ప్రతిరోజు వాటిని చూస్తూ ఉండటం వల్ల మీ పిల్లలు కూడా అందంగా పుడతారని చెబుతుంది.ఇక అది చూసిన జానకి మల్లి నీ దొంగ కడుపుతో రోజురోజుకు అత్తయ్య గారికి ఆశలు పెట్టిస్తోంది. ఇదిలాగే కొనసాగితే కష్టం అత్తయ్య గారికి నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని అనుకుంటుంది.

ఇక జానకి కూడా మల్లిక దగ్గరికి వెళ్లి ఇప్పటికైనా నీ దొంగ వేషాలు ఆపు వెంటనే వెళ్లి అత్తయ్య దగ్గర నిజం ఒప్పుకో లేదంటే నేనే చెప్తాను నీకు ఈరోజు రాత్రి వరకే గడువు.నీ అంతట నువ్వే వెళ్లి అత్తయ్య గారి కాళ్లపై పడి క్షమాపణలు కోరు లేకపోతే నేనే రేపు పొద్దున ఈ విషయం అత్తయ్య గారికి చెబుతాను అని అక్కడి నుంచి వెళ్తుంది.మరోవైపు జానకి మాధురి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి హాస్పిటల్ వెళుతుంది.తన పరిస్థితి ఏంటి అని ఆరాధ్యగా తాను నుదుటిపై పెద్దగా దెబ్బ తగలడంతో కోలుకోవడం కష్టంగా ఉంది అని డాక్టర్ చెబుతాడు.అదేంటి తనకు వెనుక కథ దెబ్బ తగిలింది అని జానకి ఆలోచనలో పడి డాక్టర్ను ప్రశ్నించగా వెనక తగిలిన దెబ్బ అయితే రెండు రోజుల్లోనే తను కోలుకునేది.

తన తల నుదుటి భాగంలో పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది తనని ఎవరో బలంగా రాడ్డుతో కొట్టారని డాక్టర్లు చెప్పడంతో జానకి షాక్ అయ్యి ఆలోచనలో పడుతుంది. ఇక తన ప్రమాదం విషయంలో ఎన్నో సందేహాలు తలెత్తడంతో జానకి ప్రమాదం జరిగిన చోటకు వెళ్లి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతుంది. అయితే అక్కడ తనకు ఒక ఉంగరం దొరకడంతో వెంటనే దానిని తీసుకొని బంగారు షాప్ అతను వద్దకు వెళ్తే ఆ ఉంగరం కన్నబాబు కొన్నాడని చెప్పడంతో ఒక్కసారిగా జానకి షాక్ అవుతుంది. దీంతో మాధురి పై దాడి చేసింది కన్నబాబు అని అర్థమవుతుంది.