కుటుంబ పరిస్థితులను చూసి షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి… ఇక లాస్యకు చుక్కలే!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే లాస్య పరంధామయ్య అనసూయను భోజనానికి పిలిచి లోపలికి వెళ్తుంది అయితే చాలా స్పెషల్ భోజనం వండి పెడుతుందని ఎదురుచూస్తున్నటువంటి వీరికి పచ్చి కూరగాయలు తెచ్చిపెడుతుంది.ఇదేంటి అని ప్రశ్నించడంతో ఇవి మీ ఆరోగ్యానికి మంచిది ఇకపై మీరు ఇలాంటివి మాత్రమే తినాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సామ్రాట్ తులసి ఇద్దరు కూడా బర్త్డే పార్టీకి వెళ్లి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఇక అనసూయ పరందామయ్య కూడా ఇద్దరు రోడ్డుపై నడుస్తూ వెళుతూ ఉండగా అక్కడ గుమగుమలు రావడంతో భోజనం చేసి వెళ్దాం ఇంటికి వెళ్తే మరి ఆ పచ్చి కూరగాయలు తినాలి అని బాధపడుతూ సెక్యూరిటీకి కనిపించకుండా లోపలికి వెళ్తారు.

ఇలా చాటుగా అనసూయ పరంధామయ్య అక్కడ భోజనాలు వట్టించుకొని తింటూ ఉండగా సెక్యూరిటీ వచ్చి అడ్డుకుంటారు.మీరు గట్టిగా అరవకండి మేం భోజనం చేయకుండా వెళ్ళిపోతామని అనసూయ చెప్పినప్పటికీ సెక్యూరిటీ వినకుండా గట్టిగా అరవడంతో అక్కడికే సామ్రాట్ స్నేహితుడి వచ్చి మీరు కడుపు నిండా తినండి కొంతమంది పిల్లలు ఉంటారు. కానీవారికి తల్లిదండ్రులు ఏమాత్రం పట్టరు వారిని రోడ్డుకి ఈడుస్తారని చెప్పి వారిని కడుపునిండా తిని పార్సల్ తీసుకెళ్లమని చెబుతారు. అంతలోపు తులసి అక్కడికి రావడంతో అనసూయ పరంధామయ్యను చూసి బాధపడుతుంది.అయితే వాళ్లు తన పేరెంట్స్ అని తెలియడంతో సామ్రాట్ స్నేహితుడు తులసిని ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తాడు.

అప్పుడు పరంధామయ్య తులసిని మీరు ఏమీ అనకండి తప్పు మాదే అంటూ అక్కడి నుంచి వెళ్తారు.ఇక తులసి తన కుటుంబ సభ్యులను వారి పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సామ్రాట్ ఆఫీస్ కి వెళ్లి ఈ మధ్య నేను తీసుకుంటున్న నిర్ణయాలు చాలా తప్పుగా ఉంటున్నాయి. అనుకుంటున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది సరైనదా కాదా మిమ్మల్ని అడుగుదామని వచ్చానని చెప్పడంతో మీ నిర్ణయం ఏంటి అని సామ్రాట్ అడుగుతారు. దీంతో తులసి తిరిగి నేను నా ఇంటికి వెళ్లి పోతానని చెప్తుంది.

మరుసటి ఎపిసోడ్లో భాగంగా నందు తులసి ఇంటిని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతుండగా వడ్డీ వ్యాపారి ఇంటి డాక్యుమెంట్స్ మీ పేరుపై ఉన్నాయి కదా అనడంతో అంతలోపు తులసి అక్కడికి వచ్చిఆ డాక్యుమెంట్స్ ఇప్పటివరకు రిజిస్టర్ కాలేదని తాను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండడానికే వచ్చానని చెప్పడంతో నందు లాస్య షాక్ అవుతారు.