ఒకప్పుడు పరువు తీస్తున్నావ్ అన్న వాల్లే ఇప్పుడు పోగుడుతున్నారు… ఎమోషనల్ అయిన ఝాన్సీ!

కొంతమంది వారి టాలెంట్ వల్ల ఓవర్ నైట్ లో సెలెబ్రిటీలుగా మారుతున్నారు. ఇలా ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు. కొన్ని రోజుల క్రితం వరకు కండక్టర్ ఝాన్సీ అంటే గాజువాక చుట్టుపక్కల ప్రాంతాలలో వారికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మారుమోగిపోతుంది. అందుకు కారణం మల్లెమాల. 11 ఏళ్ల క్రితమే జీ తెలుగులో కనిపించిన ఝాన్సీ అప్పుడు పాపులర్ అవ్వలేదు. కానీ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైకు పాటకి తన డాన్స్ తో అదరగొట్టిన ఝాన్సీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సెలబ్రిటీగా మారిపోయింది.

ఇలా మల్లెమాల వారి వల్ల ఎంతోమంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మారిపోయారు. డాన్స్ మీద ఉన్న ఇష్టంతో డాన్స్ నేర్చుకొని భర్త సహకారంతో ఒకవైపు రికార్డు డాన్స్ లు చేస్తూ.. మరొకవైపు కండక్టర్గా విధులు నిర్వహించిన ఝాన్సీ ఇప్పుడు డాన్సర్ గా మంచి గుర్తింపు పొందింది. దీంతో ప్రస్తుతం ఝాన్సీకి సినిమాలలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఝాన్సీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు బాధలు భరించింది.

ఇక ఇటీవల ఝాన్సీ బుల్లెట్ భాస్కర్ టీం లో కంటెస్టెంట్ గా చేసింది. ఈవారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది . ఈ క్రమంలో స్కిట్ అయిపోయిన తర్వాత రష్మి వచ్చి జబర్దస్త్ కి రాకముందు వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించగా.. గతంలో రికార్డ్ డాన్స్ చేస్తున్నానని మా బంధువులు తీపోసారు.కానీ ఇప్పుడు పరువు తీస్తున్నానని నన్ను తిట్టిపోసిన వాళ్లే ఇప్పుడు ఫోన్ చేసి మా పరువు నిలబెడుతున్నావ్ అంటూ పొగుడుతున్నారు’ అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.