బాలయ్యతో కలసి ఒకే వేదికపై సందడి చేయనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించాడు. వయసు పెరుగుతున్న కొద్ది బాలయ్య మరింత ఎనర్జీతో సినిమాలు చేస్తే కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతే కాకుండా రియాలిటీ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తన సత్తా చాటుకున్నాడు. ఇక ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో లో ఫాస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ సన్నమైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. దీంతో ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 ని నిర్వాహకులు ఇటీవల ప్రారంభించారు.

ఇక అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు, అతని తనయుడు నారా లోకేష్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇలా మొదటి ఎపిసోడ్ లో బాలకృష్ణ తన వియ్యంకుడు.. అల్లుడితో కలసి చేసిన సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుని రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య చంద్రబాబు మద్య జరిగిన పొలిటికల్ డిస్కషన్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది.

ఇక ఈ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ మరింత హుషారుగా వ్యవహరిస్తూ..అమ్మాయిలకు లైన్ వేసే విషయాల నుండి చీకటి పడ్డాక వేసే పెగ్ వరకూ అన్ని చర్చించాడు. ఇక ఈ షో మూడవ ఎపిసోడ్ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తో పాటు మరొక హీరోయిన్ రాశి కన్నా హాజరుకానున్నట్లూ సమాచారం. బాలకృష్ణ తో కలిసి హీరోయిన్ గా ఎన్నో సినిమాలో నటించిన రమ్య కృష్ణ ఇలా అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా హాజరయ్యి సందడి చేయనున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.