తమ ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి వెళ్లిన జ్ఞానంభ కుటుంబం…. విష్ణు పై మండిపడిన మల్లిక!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే భాస్కర్ రావుకు సరైన సమయానికి డబ్బు కట్టకపోవడంతో ఆయన ఇంటిని కాళీ చేయాలని చెబుతాడు.దీంతో చేసేదేమీ లేక జ్ఞానాంబ కుటుంబ సభ్యులు మొత్తం తమ లగేజ్ ని సర్దుకొని బయటకు వస్తారు.ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి వైపు చూస్తూ ఆ ఇంటి పట్ల తమకున్న ప్రేమను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో బయటకు వస్తారు.

ఇక అప్పటికే రామచంద్ర మరొక ఇంటిని చూసి పెట్టడంతో అందరూ ఆ ఇంటికి వెళ్తారు.ఇదే అదునుగా భావించిన మల్లికా మనం ఇలాగా ఆ ఇంటిని వదిలేసి బయటకు వస్తామని బావగారికి ముందే తెలిసినట్టుంది అందుకే రెడీగా ఇల్లు కూడా చూసి పెట్టారని దెప్పి పొడుస్తుంది.ఇక రామచంద్ర మాట్లాడుతూ ఇది తన షాప్ లో పనిచేసే కుర్రాడు చూసి పెట్టిన ఇల్లు అని చెప్పగా అంతలోపే ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు చాలా చిన్నదిగా ఉంది మీరు కాస్త సర్దుకోండి అని చెప్పి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్తాడు.

ఇల్లు తాళాలు తెరగా లోపల సామాన్లు అన్ని చిందరవందరగా ఉంటాయి. అలాగే రెండే గదులు ఉండడంతో మల్లిక ఈ రెండు గదులలో మనం పది మంది ఎలా సరిపోతామో అందుకే మీరు ఇక్కడ ఉండండి మేము విడిగా వెళ్లిపోతాము అని చెప్పడంతో జ్ఞానంభ ఎక్కడికి వెళ్ళేది అందరం కలిసే ఉండాలి అని చెబుతుంది.విడిపోయినంత సులభంగా తిరిగి కలుసుకోలేము అని చెప్పగా అసలే మామయ్య గారికి బాలేదు మీరు ఎక్కడ ఉంటారు అని అడగడంతో మనసు విశాలంగా ఉండాలి కానీ ఇల్లు కాదు మనసు చాలా విశాలమైనదైతే చిన్న గదులు కూడా పెద్దగా ఉంటాయి. ఉన్న రెండు గదులలో ఒక గదిలో మీరు మరొక గదిలో జెస్సి వాళ్లు ఉండమని చెబుతుంది.

ఇక రామా జానకి వంటగదిలో ఉండగా మేము ఎక్కడో ఒకచోట ఉంటాము అని జ్ఞానంబ చెప్పడంతో వాళ్లు తమ లగేజ్ ను తీసుకొని వాళ్ళు గదులు సర్దుకోవడానికి వెళ్తారు.జానకి వంటగదిలో శుభ్రం చేస్తూ ఉండగా ఇంత చిన్న గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా నా వల్లే జరిగింది కదా అని రామా బాధపడగా ఇందాకే అత్తయ్య గారు చెప్పారు మన మనసు విశాలంగా ఉండాలి అని జానకి చెప్పడంతో మీరు నేను బాధ పడకూడదని అలా మాట్లాడుతున్నారు జానకి గారు అంటూ బాధపడతారు.

మరోవైపు మల్లికా తన గదిలోకి వెళ్లి విష్ణు పై మండిపడుతుంది.మనం ఇలాగే ఇక్కడే కలిసి ఉంటే ఆ 20 లక్షల అప్పు కూడా మని నెత్తిన వేస్తారు అందుకే బయటకు వెళ్దాం అని చెప్పాను అంటూ మల్లిక కోప్పడుతుంది. అదే సమయంలోనే నీలావతి ఫోన్ చేయడంతో మల్లికా నీలావతిపై కూడా కోప్పడి ఫోన్ పెట్టేస్తుంది.ఇక మనం దాచుకున్న డబ్బులతో మనం సొంతంగా షాప్ పెట్టుకుందామంటూ మల్లికా విష్ణుకి సలహా ఇస్తుంది.