ఘనంగా జెస్సి సీమంతం…. బిడ్డ పై ఆశలు వదులుకోవాలని చెప్పిన డాక్టర్…. కంగారులో జానకి!

కుటుంబ గొప్పతనాన్ని తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో జ్ఞానంబ తన మూడవ కోడలకి సీమంతం చేయాలని నిర్ణయించుకొని ఇదే విషయాన్ని జెస్సి తండ్రికి ఫోన్ చేసి చెబుతుంది. అయితే తన తల్లి ఇంట్లో లేదని తాను ఒక్కడినే వస్తానని చెప్పడంతో మరొక రోజు వాయిదా వేసుకుందామని చెప్పడంతో ఒకరికోసం శుభకార్యాన్ని వాయిదా వేయకూడదని చెబుతారు.

ఇక జ్ఞానంబ శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అందరికీ పనులు చెబుతుంది. ఇక రామ అందరికీ స్వీట్స్ భోజనాలు చూసుకోగా వచ్చే అతిథులకు ఎలాంటి లోటు ఉండకూడదని జానకికి చెబుతుంది.ఇదంతా చూస్తున్న మల్లిక మరికొన్ని రోజులు నేను అబార్షన్ నాటకం ఆడకుండా ఉంటే సరిపోయేది నేను కూడా ఎంతో చక్కగా శ్రీమంతం చేయించుకునే దాన్ని అంటూ బాధపడుతుంది. మల్లికను చూసిన జ్ఞానంబ తను ఇలాంటి సమయంలో ఇక్కడ ఉండి బాధపడటం కన్నా తనని వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్లమని విష్ణుకి చెబుతుంది.

ఇలా విష్ణు ఇప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు తనని తీసుకెళ్తే ఏం బాగుంటుందిమ్మ మా బిడ్డ లేకపోయినా మన ఇంటికి మరో బిడ్డ వస్తుందన్న ఆనందం చాలా ఉంది అంటూ సీమంతపు వేడుకలలో బిజీ అవుతారు. మరోవైపు రామ జానకికి తన చదువు విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె సాధించిన మెడల్స్ పుస్తకాలను తనకు చూపిస్తూ తను చదువుకోవాలని మరోసారి తనకి గుర్తు చేస్తాడు. ఈ విధంగా అందరూ కూడా శ్రీమంతపు పనులలో బిజీగా ఉండగా డాక్టర్ ఫోన్ చేస్తుంది.

ల్యాబ్ కి పంపించిన రిపోర్ట్స్ వచ్చాయని 80% బిడ్డ జన్మించే అవకాశాలు లేవని అబార్షన్ కావచ్చని చెప్పడంతో జానకి కంగారుపడుతుంది.అదేవిధంగా జెస్సి రిపోర్ట్స్ తన నర్స్ చేత ఇంటికి పంపించానని డాక్టర్ చెప్పారు. అయితే ఆ రిపోర్ట్స్ సరాసరి జ్ఞానంబ చేతికి వెళ్లడంతో జానకి అది చూసి కంగారు పడుతుంది. మరి జెస్సీ పరిస్థితి జ్ఞానంబకు తెలిసిపోతుందా లేదా అనే విషయం తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.