శ్రీముఖి జబర్దస్త్ ని రెండవసారి రిజెక్ట్ చేయడానికి అసలు కారణం అదే..?

తెలుగులో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తోంది. ఇక ఈ షోకి అనసూయ, రష్మీలు యాంకర్లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ షో ప్రారంభించిన సమయంలో షో నిర్వాహకులు యాంకర్ గా మొదటి శ్రీముఖిని సంప్రదించారట. కానీ శ్రీముఖి కొన్ని కారణాలవల్ల అవకాశాన్ని కాదు అనడంతో ఆ ఛాన్స్ అనసూయకు దక్కింది.

యాంకర్ గా శ్రీముఖి అలరిస్తూనే కొన్నేళ్లపాటు జబర్దస్త్ లో దూసుకుపోయింది. ఇకపోతే ఆమె ప్రస్తుతం నటిగా సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది. దీంతో ఆమె ఇటీవల జబర్దస్త్ షో షో కి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే అనసూయ వెళ్ళిపోవడంతో ఆమె స్థానంలో శ్రీముఖిని రీప్లేస్ చేయాలి అని షో నిర్వాహకులు అనుకోని ఆమెను సంప్రదించారట. గతంలో కూడా శ్రీముఖి మొదటిసారి తనకు అవకాశం వచ్చినప్పుడు వదులుకొని చాలా బాధపడిందట. కాబట్టి ఈసారి అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తుంది అని అందరూ భావించారు.

కానీ శ్రీముఖి రెండవసారి కూడా జబర్దస్త్ అవకాశం వచ్చిన ఆమె యాంకర్ గా చేయలేనని చెప్పేసిందట. అందుకు కారణం కూడా తెలిపిందట. శ్రీముఖి జబర్దస్త్ రెండో సారి రిజెక్ట్ చేయడానికి గల కారణం.. జబర్దస్త్ కార్యక్రమానికి తాను యాంకర్ గా వ్యవహరిస్తే తాను ఈటీవీ కి ఒక బాండు రాసి ఇవ్వాల్సి ఉంటుందని. కానీ తాను కేవలం ఈటీవీ కి మాత్రమే పరిమితం అవ్వాలి అని కోరుకోవడం లేదు అనే శ్రీముఖి తెలిపిందట. అన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పాటు యూట్యూబ్ లో కూడా తన సందడి చేయాలి అనుకున్నట్లు ఆమె తెలుపుతూ ఈటీవీ బాండ్ కి తాను కట్టుబడి ఉండలేనట్లు ఆమె తెలిపిందట.