రష్మీ గారూ అంటూ అందరికీ షాక్ ఇచ్చిన సుధీర్… ఇదంతా ప్రేమతోనా లేక మర్యదతోనా?

roja asks about sudheer and rashmi love story in jabardasth stage

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు కామెడీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా అడపా దడపా సినిమాలలో హీరోయిన్గా కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇటీవల సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా తెరకెక్కిన “బొమ్మ బ్లాక్ బాస్టర్” సినిమాలో రష్మీ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సుడిగాలి సుధీర్ కూడా హాజరయ్యాడు. చాలాకాలం తర్వాత సుధీర్ , రశ్మిని ఇలా ఒకే వేదికపై చూసిన వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ రేటింగ్స్ కోసం ప్రేమికుల్లా నటించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ జంట.. సుధీర్ జబర్దస్త్ దూరం అవటంతో వీరిద్దరూ కూడా దూరమయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. చాలా కాలం తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించారు.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మునుపెన్నడూ లేని విధంగా రష్మీ పట్ల సుధీర్ కి మర్యాద పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్మి నీ ‘రష్మి గారు’ అంటూ పిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ఫేమస్ అయిన సుధీర్ డైలాగ్ ని ధనరాజ్ మళ్ళీ చెప్పించాడు. “నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలీదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా” అంటూ చెప్పిన డైలాగ్ ని పౌరాణిక పద్యంలా చెప్పాలని ధనరాజ్ చెప్పగా.. సుధీర్ అదే విధంగా చెప్పారు. సుధీర్ డైలాగ్ చెబుతున్న సమయంలో రష్మీ సిగ్గు పడుతూ కనిపించింది. అయితే సుధీర్ రష్మీ గారు అంటూ పిలవటంలో అర్థం ఏమిటని ప్రేక్షకుల మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి. రష్మీ మీద ఉన్న ప్రేమ వల్ల ఇలా పిలిచాడా లేక ఆమె హీరోయిన్ అయ్యిందన్న మర్యాద వల్ల ఇలా పిలిచాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.