హాస్పిటల్ లో అడ్మిట్ అయిన షణ్ముఖ్… ఆందోళనలో అభిమానులు…?

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని సెలబ్రిటీలుగా పాపులర్ అవుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొంది ఫేమస్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ యూట్యూబర్ గా మంచి గుర్తింపు పొందిన షణ్ముఖ్ సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీ వల్ల షణ్ముఖ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ ఆ సీజన్లో రన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ షో కి వెళ్లిన తర్వత అక్కడ హౌస్ లో సిరితో చాల చనువుగా ప్రవర్తించిన షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ నుండి నెగెటివిటీ మూట కట్టుకొని బయటికి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో సిరితో చనువుగా ఉండటం వల్ల ఐదు సంవత్సరాల తన ప్రేమకు బ్రేక్ పడింది. ప్రస్తుతం షణ్ముఖ్ తన కెరీర్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఇటీవల షణ్ముఖ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్ని రోజులుగా షణ్ముఖ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో ఇటీవల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షణ్ముఖ తొందరగా కోలుకొని అనారోగ్యం నుండి బయట పడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇటీవల షణ్ముఖ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అతను అభిమానులను ఊపిరిపించుకునేలా చేసింది. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ “నేను బాగున్నాను ఐ యాం ఫైన్” అంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దీంతో షణ్ముఖ్ అభిమానులు కొంచెం రిలాక్స్ అయ్యి గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.