మగ బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి పల్లవి… శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు!

సాధారణంగా సినిమా నటీనటులకు మాత్రమే కాకుండా సీరియల్ నటీనటులకు కూడా ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆడదే ఆధారం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి పల్లవి రామిశెట్టి కి కూడా తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. భార్యామణి, ఆడదే ఆధారం, అత్తారింటికి దారేది, పాపే మా జీవనజ్యోతి వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన పల్లవి కొంతకాలం క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం జరిగిన కొంతకాలానికి ఆమె గర్భవతి అవ్వడంతో సీరియల్స్ కి పూర్తిగా దూరం అయింది.

ఇలా పల్లవి సీరియల్స్ కి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచూ ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలతో పాటు తన సీమంతానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా నెలలు నిండటంతో పల్లవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తన బిడ్డకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలో తన కుమారుడి చిన్ని పాదాలను చూపిస్తూ మురిపోతోంది. ఇలా పల్లవి మగబిడ్డకు జన్మనివ్వటంతో పలువురు టీవీ సెలబ్రెటీలతోపాటు ఆమె అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా పల్లవి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ప్రస్తుతం పల్లవి బాబుకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గర్భవతి అవటం వల్ల చాలా కాలం సీరియల్స్ కి దూరంగా ఉంటున్న పల్లవి ఇక తొందరలోనే మళ్లీ సీరియల్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.