బాలయ్యతో కలసి ఒకే వేదికమీద సందడి చేయనున్న రోజా..ఇక దబిడి దిబిడే?

నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. దాదాపు తన 48 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాకుండా అఖండ సినిమాతో భారీ హిట్ అనుకున్న బాలకృష్ణ తన జోరు మరింత పెంచి ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తనదైన శైలిలో బాలకృష్ణ హోస్ట్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మొదటి సీజన్ మంచి పాపులర్ అవ్వటంతో అదే ఊపుతో రెండో సీన్ కూడా మొదలు పెట్టారు. రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు తో పాటు నారా లోకేష్ కూడా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో తన కుటుంబ విశేషాలతో పాటు ఏపీ రాజకీయ విషయాల గురించి చర్చించాడు. ఇక ఈ సీజన్ 2 ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరై సందడి చేశారు. బాలకృష్ణ కూడా కుర్రాడు లాగా ఇద్దరితో కలిసి చాలా సరదాగా నడిపించాడు. ఇక ఈ సీజన్ 2 మూడవ ఎపిసోడ్ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తో పాటు యంగ్ బ్యూటీ రాశిఖన్నా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో పర్యటక మంత్రిగా ఉన్న రోజా.. బాలకృష్ణతో కలిసి అన్ స్టాపబుల్ షో లో సందడి చేయబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన రోజా.. బాలకృష్ణతో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది. ప్రస్తుతం బాలకృష్ణ, రోజా ఇద్దరూ కూడా రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రోజా అధికార పార్టీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే… బాలకృష్ణ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకవేళ రోజు ఈ షో కి హాజరైతే ఏపీ రాజకీయాల గురించి వీరిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.