దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ మొదటిసారిగా ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించడం వల్ల ఈ షో మంచి ప్రేక్షకాఆదరణ సొంతం చేసుకుంది. దీంతో మొదటి సీజన్ కి ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ వల్ల సీజన్ 2 కూడా ప్రారంభించారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా బాలకృష్ణ తన వియ్యంకుడిని , అల్లుడిని ఆహ్వానించాడు.

ఆహా వేదికగా ప్రసారమైన ఈ రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ఈ షో లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగత సంభాషణతో పాటు రాజకీయాలకు సంబంధించిన సంభాషణ కూడా జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు జీవితంలో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి అని బాలకృష్ణ ప్రశ్నించగా..1995 లో తీసుకున్న నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. 1995లో జరిగిన ఘటనపై బాలకృష్ణ, చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవం అని ఎప్పుడు నా గుండెల్లో నిలిచి ఉంటారు అంటూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన సంగతి అందరికీ తెలుసని.. ఎన్టీఆర్ నాకు ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. ఈ షో చూసి జనాలు నవ్వుకుంటున్నారు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది.