గురువారం కూడా యాడ్ అయితే ఆ రేఖ పెరుగుతుంది అంటూ రష్మి జాతకం చెప్పిన ఆది?

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి టీం లీడర్ స్థాయికి ఎదగడమే కాకుండా తన పంచులు సెటైర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ జబర్దస్త్ లో నెంబర్ వన్ టీం లీడర్ గా గుర్తింపు పొందాడు. హైపర్ ఆది ఎక్కడ ఉంటే అక్కడ సందడి చేస్తూ బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కూడా తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాంప్రసాద్ తో కలిసి సందడి చేస్తూ షో ని ముందుకి నడిపిస్తున్నాడు.

ముఖ్యంగా ఈ షోలో రష్మీ ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఆమె మీద పంచులు, సెటైర్లు వేస్తూ ఉంటాడు. రష్మీ కూడా వాటిని సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆది ఆటలు కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఎప్పటిలాగే రేష్మి మీద ఆది పంచులు సెటైర్లు వేస్తూ రెచ్చిపోయాడు. ఈవారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆది పురోహితుడిగా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో అందరి చేతులు చూస్తూ జాతకాలు చెబుతూ సందడి చేశాడు. రష్మీ కూడా ఆది వద్దకు వచ్చి తన జాతకంలో ధన రేఖ ఎలా ఉందో చూడమని ఆదికీ తన చేయి అందిస్తుంది.

అయితే రష్మీ చేయి అందుకున్న ఆది ఆమె చేయి పరిశీలిస్తూ .. ఈ చేతిలో గీతల కంటే ముడతలే ఎక్కువగా ఉన్నాయి అంటూ రష్మీ పరువు తీశాడు. ఇక ధన రేఖ విషయానికి వస్తే ఇప్పుడు ఆ రేఖ కాస్త తగ్గినట్లు ఉంది అంటూ చెప్పాడు. గురువారం కూడా యాడ్ అయితే ధన రేఖ బాగా పెరుగుతుంది అంటూ చెప్పాడు. అంటే అనసూయ వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ లో అనసూయ స్థానంలో రష్మీ యాంకర్ గా కొనసాగుతోంది. ఇటీవల రష్మి స్థానంలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ రావటంతో రష్మీ కి జబర్దస్త్ లో యాంకరింగ్ చేసే ఛాన్స్ మిస్ అవటంవల్ల ధన రేఖ కూడా తగ్గింది అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు.