స్విమ్మింగ్ పూల్ లో తడిసిన అందాలతో రెచ్చిపోయిన రష్మి… వైరల్ అవుతున్న వీడియో?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కూడా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన రష్మి తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు పొందింది. ఇక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం నడపటం వల్ల మరింత పాపులర్ అయ్యింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో తో పాటు ప్రత్యేక కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇలా ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ హిట్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు పొందలేకపోయింది. కానీ ఇటీవల నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ అందుకుంది. ఇంతకాలం సినిమా ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్న రేష్మి సినిమా విడుదలై హిట్ అందుకున్న తర్వాత వెకేషన్ ఎంజాయ్ చేయటానికి మాల్దీవ్స్ కి చెక్కేసినట్లు తెలుస్తోంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రష్మి ఫోటోలు వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాల్దీవ్స్ లో స్విమ్మింగ్ పూల్ లో బినికి ధరించి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ తడిసిన అందాలతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ షోలో కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరించేది. ఇక ఇటీవల జబర్దస్త్ కి కొత్త యాంకర్ రావటంతో రష్మీ జబర్దస్త్ కి దూరమైంది. అలాగే సుధీర్ వెళ్లిపోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరించింది. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై రష్మీకి ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రమే మిగిలింది.