సరదాగా షికారుకు వెళ్లిన రామా జానకి… వాళ్లను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మల్లిక!

జానకి కలగనలేదు సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.నేటి ఎపిసోడ్ లో భాగంగా తన భార్యను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని పట్టుబడతాడు. ఇకపోతే లక్ష పత్రి పూజ చేసిన మల్లికా చేతులు నొప్పిస్తున్నాయంటూ బాధపడటమే కాకుండా తన దొంగ కడుపు గురించి జానకి ఎక్కడ బయట పెడుతుందో అని కంగారు పడుతుంది.తను నా కడుపు గురించి బయట పెడితే నేను తను చదువు మానేసిందని చెప్పి రచ్చ చేస్తా అంటూ తనలో తాను అనుకుంటుంది. అదే సమయంలోనే చికిత మల్లిక దగ్గరికి వచ్చి సరదాగా తనతో కాసేపు తమాషా చేస్తుంది.

మరోవైపు జ్ఞానంభ రామాని పిలిచి భాను ఫోన్ చేసింది నిన్ను చూడాలని ఉంటుందని చెప్పగా వెంటనే జానకి వచ్చి భాను ఎవరు అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు రామ ఆమె అమ్మ స్నేహితురాలు అని చెప్పగా వెంటనే జ్ఞానంభ భానుకి రామా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు తనని పెంచుకొని చదివిస్తానని చెప్పింది అంటూ తన గురించి చెబుతారు. తనని చూడటం కోసం వెళ్లి రండి అంటూ రామా జానకిని పంపిస్తుంది.

ఈ విధంగా వీరిద్దరూ కలిసి బైక్ పై సరదాగా వెళ్ళిపోతారు. అది చూసిన మల్లికా కుళ్ళుకుంటూ ఓ రేంజ్ లో ఏడుస్తుంది. నేను వెళ్తాను అత్తయ్య అని చెప్పగా కడుపుతో ఉన్న వాళ్ళు అంత దూరం వెళ్ళకూడదని జ్ఞానంభ అడ్డుకుంటుంది.ఈ దొంగ కడుపు కారణంగా తాను ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా పోయింది అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే విష్ణు వచ్చి ఏం జరిగింది అని చెప్పగా ఎవరో భానుని చూడటానికి కోసం జానకి బావగారు సరదాగా బండిపై వెళ్లారు మనము వెళ్దామంటే అత్తయ్య గారు ఒప్పుకోలేదు అంటుంది.

కడుపుతో ఉన్నావు కదా వద్దని చెప్పి ఉంటారు. అది తప్ప ఇంకేమైనా చేస్తాను అనగా వెంటనే నాకు బిర్యాని కావాలని అడుగుతుంది. బిర్యానీ కోసమే ఈ దొంగ ఏడుపులన్ని అంటూ విష్ణు మండిపడతారు. మరోవైపు జానకిరామ ఇద్దరు బైక్ పై వెళ్తూ పొలాల గట్ల వద్ద ఆగి చిన్నపిల్లలా ఎంతో ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. పెళ్లయిన కొత్త జంటలా వీరిద్దరూ ఎంతో సరదాగా గడుపుతూ ఆ ఊరికి వెళ్తారు. ఇక భాను క్యారెక్టర్ లో నటుడు ఇంద్రనీల్ భార్య ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ తో ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.