ఆర్పీ చెప్పేవన్నీ నిజాలే… జబర్దస్త్ బాగోతం బయటపెట్టిన రాకేష్ మాస్టర్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ పై వచ్చిన ఆరోపణలు హార్ట్ టాపిక్ గా మారాయి. జబర్దస్త్ నుండి కమెడియన్ గా బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పీ ఇటీవల జబర్దస్త్ కామెడీ షో గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ యాజమాన్యం వారు అక్కడ పని చేసే వారితో చాలా నీచంగా ప్రవర్తిస్తారని వారికి సరైన భోజనం కూడా పెట్టరు అంటూ ఆర్పీ వెల్లడించాడు. జబర్దస్త్ గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు క్లారిటీ ఇస్తున్నారు. జబర్దస్త్ లో అలాంటివన్నీ ఏం జరగటం లేదని, ఆర్పి చెప్పిన వాటిలో నిజం లేదని అంటున్నారు. ఒకవేళ ఆర్పి చెప్పినట్టే జబర్దస్త్ యాజమాన్యం వారు అక్కడ పని చేసే వారిని నీచంగా చూస్తే అన్ని సంవత్సరాలుగా అందరూ అక్కడ ఎందుకు పనిచేస్తారు అంటూ ఆర్పి ఒక్కోని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇటీవల ఈ వివాదంపై ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కూడా స్పందించాడు. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ జబర్దస్త్ గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పి చెప్పినవన్నీ నిజాలే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతు జబర్దస్త్ లో జరిగే సంఘటనల గురించి వివరించాడు. ఆర్పీ చెప్పినట్టు జబర్దస్త్ లో భోజనం అసలు బాగుండదని, అక్కడ పనిచేసే చాలామంది బయట నుండి భోజనం తెప్పించుకుంటారని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. గతంలో జబర్దస్త్ లో ఒక పది ఎపిసోడ్లు చేసిన అనుభవం నాకు ఉంది అంటూ ఆయన వెల్లడించారు.

బుల్లెట్ భాస్కర్ టీమ్ లో స్కిట్ చేసిన సమయంలో బుల్లెట్ భాస్కర్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆ సమయంలో నాకు మంచి భోజనం కూడా పెట్టించాడు. కానీ ఒకసారి భాస్కర్ లేకపోతే నేనే భోజనం కోసం లైన్ లో నిలబడి భోజనం పెట్టించుకొని తింటే అది చాలా చండాలంగా ఉంది అంటూ చెప్పుకొచాడు. జబర్దస్త్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఎప్పుడూ అమ్మాయిలతో సమయం గడుపుతూ.. వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జబర్దస్త్ లో షూటింగ్ సమయంలో డైరక్టర్ వస్తే అక్కడున్న వారందరూ లేచి నిలబడాలి అంటూ వివరించాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఢీ సెట్ కి ప్రతిరోజు వస్తాడు. కానీ జబర్దస్త్ సెట్ లో నాకు ఒక్కరోజు కూడ ఆయన కనిపించలేదు.. అని జబర్దస్త్ లో జరిగే విషయాలు బయటపెట్టాడు.