ఢీ షో లో వివాదం.. ఆది, ప్రదీప్‌కి వార్నింగ్ ఇచ్చిన మెంటర్..?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లుగా, డాన్సర్లుగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు ఈ షో రేటింగ్స్ బాగా పడిపోయాయి. అందుకు కారణం షో ఉన్న జడ్జి లు, మెంటర్స్ అందరూ మారిపోవటం. ఇంతకుముందు శేఖర్ మాస్టర్, ప్రియమణి జడ్జి లుగా ఉండి సుధీర్, రష్మి మెంటర్స్ గా ఉన్నప్పుడు ఈ షో కి భారీ రేటింగ్ వచ్చేది . కానీ ఇపుడు వీరందరూ లేకపోవటంతో ఈ షో పరిస్థితి దారుణంగా తయారయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఢీ షో లో గొడవ జరిగింది.

ఈవారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రమొలో అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ చుసి ఆనందించిన ప్రేక్షకులు ఆ తర్వాత జరిగిన గొడవ చుసి షాక్ అయ్యారు. ప్రస్తుతం హైపర్ ఆది, నవ్య స్వామి, రవికృష్ణ, కిరణ్ మచ్చా ఈ షో లో టీం లీడర్లుగా ఉన్నారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్‌ చేసిన డ్యాన్స్‌ పర్‌ఫామెన్స్‌ని మెచ్చుకున్న శ్రద్ధదాస్‌ వారితో కలిసి డ్యాన్స్‌ చేసింది. దాంతో కిరణ్‌ మచ్చా లేచి.. మీరు పార్శాలిటీ చూపిస్తున్నారు.. జడ్జీ స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్ట్‌ కాదని అంటూ ఆమెతో వాదనకు దిగాడు. అయితే ప్రదీప్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వటానికి ప్రయత్నిస్తే మధ్యలో నీ ఒర్లుడు ఏంది అంటూ ప్రదీప్ పై సీరియస్ అయ్యాడు.

DHEE 14 - Dancing Icon Latest Promo - 27th July 2022 - #Dhee14-Hyper Aadi,PradeepMachiraju

ఆ సమయంలో శ్రద్దా దాస్ మీరు కొంచం సౌండ్ తగ్గించి మాట్లాడండి అని శ్రద్ధా దాస్ ‌ అనడంతో వివాదం మరింత ముదిరింది. శ్రద్దా దాస్ అలా అనటంతో నేనేం చేయాలో నాకు తెలుసు మీరు ఎవరు చెప్పటానికి అంటూ శ్రద్ధాదాస్ ని అవమానించాడు. అయితే చివరకు అది కూడా కల్పించుకొని కిరణ్ కి సరిది చెప్పడానికి ప్రయత్నించగా భయ్యా నీ జోకులన్నీ నా దగ్గర వద్దు అంటూ అది మీద కూడా సీరియస్ అయ్యాడు. అయితే ప్రోమో చూసిన ప్రేక్షకులు ఇదంతా టిఆర్పి రేటింగ్స్ కోసం చేసిన ప్రాంక్. ఇప్పటికీ ఇలాంటివన్నీ చూసి చాలా విసుగుచున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.