జానకిని పనిమనిషి అంటూ అవమానించిన మల్లిక…. పరిస్థితులు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రామ!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… మల్లిక పనులు చేయడానికి తప్పించుకొని తిరగడంతో నేను ఇంటి పనులు చేస్తూ ఇంట్లో పరిస్థితులు ఎలా చక్క పెట్టాలో ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మీ ఆయనను తీసుకొని ఎలా బయటికి వెళ్లాలని ఆలోచిస్తున్నావా అంటూ నిలదీస్తుంది. దాంతో మల్లిగా బావగారు అఖిల్ ఉద్యోగం పేరు చెప్పి 20 లక్షలు తీసేసుకుని మనల్ని రోడ్డుపై ఇలా పడేశారు.మా అందరి కష్టాలకు కారణమైన నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలు కావచ్చు ఏమో కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఒక పని మనిషివి అంటూ తనని అవమానిస్తుంది.

ఈ విధంగా మల్లికా అవమానించడంతో జానకి బయటకు వస్తుంది బయట చికిత ఏమైందమ్మా అని అనడంతో ఏం లేదని కవర్ చేసుకుంటుంది. మరోవైపు అందరిని భోజనానికి రమ్మని చెప్పి పిలుస్తుంది అయితే తన చేతితో భోజనం పెడితే తినదని తెలిసి తన అత్తయ్యకు కావాల్సినవన్నీ కూడా జానకి జెస్సి చేత పంపుతుంది.అయితే అందరూ నేలపై కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు ఎందుకు అందరూ ఇలా మౌనంగా ఉన్నారు అని మాట్లాడుతూ జానకి వారిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది.

ఇక భోజనం చేసిన తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్ళగా జానకి మాత్రం ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన గోవిందరాజులు బాధపడతారు.అంతలోపే రామ వచ్చి ఇంత చిన్న వంట గదిలో సర్దుకుపోయే పరిస్థితికి తీసుకు వచ్చాను నన్ను క్షమించండి అంటూ మాట్లాడుతారు. ఒకవైపు రామా జానకి, మరోవైపు జ్ఞానంభ గోవిందరాజులు వారి పరిస్థితి తలుచుకుంటూ బాధపడుతుంటారు ఇది దేవుడు రాసిన రాత కాదు మన బిడ్డ రాసిన రాత అంటూ జ్ఞానాంభ బాధపడుతుంది.నేను చేసిన తప్పు వల్ల కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు అంటూ రామా కూడా మరోవైపు బాధపడతారు.

ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయామని జ్ఞానంభ బాధపడుతూ ఉండగాగోవిందరాజులు జానకి దేవుడు మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని సర్ది చెబుతారు.మరుసటి రోజు ఉదయం జానకి టిఫిన్ చేస్తుండగా రామ వచ్చి జానకి గారు తొందరగా టిఫిన్ పెట్టండి షాప్ కి వెళ్ళాలని చెప్పడంతో జానకి ఏ షాప్ కి వెళ్తారని అడుగుతుంది.దాంతో స్వీట్ షాప్ కూడా తాకట్టులో ఉండిపోయిందనే విషయం గుర్తు చేసుకొని రామ బాధపడతాడు.