ఇద్దరం కలిసి పిల్లల్ని కందాం.. జబర్దస్త్ కొత్త యాంకర్ తో ఆది బోల్డ్ కామెంట్స్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకరు.ఈయన జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వివిధ కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ తిరిగి ఎంట్రీ ఇచ్చి ఎప్పటిలాగే తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఆది కొన్నిసార్లు వేసే పంచ్ డబల్ మీనింగ్ డైలాగులు పరిధి దాటి ఇతరులను కించపరిచే విధంగా ఉంటాయని చెప్పాలి.

ఈ విధంగా హైపర్ ఆది తన డబుల్ మీనింగ్ డైలాగులతో ఇప్పటికే యాంకర్ అనసూయ రష్మి వంటి వారిని ఎంతో ఇబ్బందికి గురి చేశారు.ఇలా వారు లోపల బాధపడుతున్నప్పటికీ బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉండేవారు. అయితే తాజాగా అనసూయ స్థానంలో వచ్చినటువంటి కొత్త యాంకర్ కు సైతం హైపర్ ఆది నుంచి ఈ విధమైనటువంటి ఇబ్బంది తప్ప లేదని తెలుస్తోంది.తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా కృష్ణ భగవాన్ హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ ఈ ప్రపంచంలో అందరూ చనిపోయి మీరు యాంకర్ మాత్రమే మిగిలి ఉంటే ఏం చేస్తారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ మేమిద్దరం కలిసి ప్రపంచాన్ని సృష్టిస్తామని ఒకరి తర్వాత ఒకరిని కంటు ఉంటామని ఈయన ఎంతో పచ్చిగా బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా హైపర్ ఆది మాట్లాడటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సౌమ్య రావు సైలెంట్ గా ఉండిపోయారు.ఇలా సౌమ్య గురించి హైపర్ ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఎప్పటిలాగే హైపర్ ఆదిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.